హిందువులందరి చిరకాల స్వప్నం సాకారం కాబోతుంది.అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.2024 జనవరి మూడో వారంలో మందిర ప్రారంభోత్సవం జరగనుంది. జనవరి 21, 22, 23 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈవేడుకకు ప్రధాని మోదీని ఆహ్వానించారు .
కాగా రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు, వివిధ రాజకీయ పార్టీల నుండి అతిథులను ఆహ్వానిస్తారు. 25,000 మంది సాధువులు, 10,000 మంది ప్రత్యేక అతిథులు పాల్గొననున్నారు. రామజన్మభూమి ప్రాంగణంలోని పవిత్రోత్సవానికి హాజరవుతారన్నారు.