భారతీయ రైల్వే శాఖ దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని కొత్తగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దేశంలోని వివిధ జోన్లలో 39 ప్రత్యేక రైళ్లను నడపనుంది.కాగా వీటిలో ఏసీ ఎక్స్ప్రెస్, దురంతో, రాజధాని, శతాబ్ధి లాంటి రైళ్లు ఉన్నాయి.ఈ నెల 15 నుండి నవంబర్ 30 మధ్య దసరా సందర్భంగా 200 రైళ్లను నడుపుతామని రైల్వే బోర్డ్ ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ వెల్లడించారు.అయితే ఈ 39 రైళ్ల జాబితాను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.దసరా, దీపావళి సందర్భంగా భారతీయ రైల్వే నడిపే 39 ప్రత్యేక రైళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగే రైళ్లు కూడా ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్ల జాబితా, రూట్లు, ఇవి బయలు దేరే సమయం తదితర వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైలు నెంబర్ 02774 సికింద్రాబాద్ నుంచి షాలిమార్కు ప్రతీ మంగళవారం రైలు బయల్దేరుతుంది. అయితే ఈ నెల 13 నుండి ఈ రైలు అందుబాటులోకి రానుంది. ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్లో రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. ఈ రైలు వరంగల్, రాయనపాడు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.రైలు నెంబర్ 02773 షాలిమార్ నుంచి సికింద్రాబాద్కు ప్రతీ బుధవారం రైలు బయల్దేరుతుంది. అక్టోబర్ 14 నుంచి ఈ రైలు అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 4.05 గంటలకు షాలిమార్లో బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, రాయనపాడు, వరంగల్ రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది.
రైలు నెంబర్ 02708 తిరుపతి నుంచి విశాఖపట్నం వారంలో మూడు రోజులు రైలు అందుబాటులో ఉంటుంది. ఈ నెల 14 నుంచి ప్రతీ బుధవారం, శుక్రవారం, ఆదివారం రాత్రి 9.50 గంటలకు తిరుపతిలో రైలు బయల్దేరుతుంది. మరుసటిరోజు ఉదయం 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, న్యూ గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో ఆగుతుందిరైలు నెంబర్ 02708 తిరుపతి నుంచి విశాఖపట్నం వారంలో మూడు రోజులు రైలు అందుబాటులో ఉంటుంది.అక్టోబర్ 14 నుంచి ప్రతీ బుధవారం, శుక్రవారం, ఆదివారం రాత్రి 9.50 గంటలకు తిరుపతిలో రైలు బయల్దేరుతుంది. మరుసటిరోజు ఉదయం 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, న్యూ గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో ఆగనుంది.రైలు నెంబర్ 02784 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం ప్రతీ వారం ప్రత్యేక రైలు నడవనుంది.
అక్టోబర్ 17 నుంచి ప్రతీ శనివారం సాయంత్రం 5.50 గంటలకు సికింద్రాబాద్లో రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. దారిలో గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వేస్టేషన్లలో రైలు ఆగనుంది. ఇక రైలు నెంబర్ 02783 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు ప్రతీ వారం ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 18 నుంచి ప్రతీ ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు రైలు విశాఖపట్నంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లలో ఆగనుంది.రైలు నెంబర్ 02775 కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వరకు వారంలో మూడు రోజులు ప్రయాణిస్తుంది. 2020 అక్టోబర్ 25 నుంచి ప్రతీ మంగళవారం, గురువారం, శనివారం రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. ఈ రైలు దారిలో రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగనుంది. రైలు నెంబర్ 02776 లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్కు వారంలో మూడు రోజులు ప్రయాణిస్తుంది. 2020 అక్టోబర్ 26 నుంచి ప్రతీ సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 7.55 గంటలకు లింగంపల్లిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.15 గంటలకు కాకినాడ టౌన్ చేరుకోనుంది. ఈ రైలు దారిలో బేగంపేట్, సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి స్టేషన్లలో ఆగనుంది.