నటి కీర్తి సురేష్ మహిళా ప్రాధాన్యమున్న వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతుంది.కాగా ఆమెలోని నటనకు గుర్తింపు తెచ్చింది మాత్రం ‘మహానటి’ .ఈ చిత్రానికి గాను కీర్తి సురేష్ కు జాతీయ అవార్డు లభించింది.అయితే ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం “గుడ్ లక్ సఖి” విడుదల తేదీని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.జూన్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రబృదం పేర్కొంది.
ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇందులో షూటర్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో ఎ వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు.కాగా శ్రావ్య వర్మ ఈ చిత్రానికి సహనిర్మాతగా ఉన్నారు.ఈ చిత్రానికి “ఇక్బాల్” చిత్ర దర్శకుడు నాగేష్ కుకునూరు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రంలో ఆది పినిశెట్టి,జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రంతో పాటు కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ సరసన ‘సర్కారు వారి పాట’, నితిన్ తో“రంగ్ దే” చిత్రాల్లోనూ నటిస్తుంది.