ఉక్రెయిన్ రెజ్లింగ్ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ పై భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ సత్తాచాటింది.తాజాగా జరిగిన మహిళల 53 కేజీల విభాగంలో బెలారస్ కు చెందిన వెనెసా పై 10-8తో గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది.ఒక దశలో కాస్త వెనుకబడినట్లు కనిపించిన ఫోగట్ అద్భుత ఆటతీరుతో తిరిగి పుంజుకుని గెలుపు బాట పట్టింది.ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరుస్తూ చాకచక్యమైన నైపుణ్యంతో విజయం వైపు సాగిన వినేశ్ ఫోగట్ ఒకేసారి 4 పాయింట్లు సాధించి అనూహ్యరీతిలో అదరగొట్టి పసిడిని సొంతం చేసుకుంది.