యూఏఈలో జరుగుతున్న ఐపిఎల్- 2020 లీగ్లో భాగంగా ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరింది.కాగా క్వాలిఫైలింగ్-1 మ్యాచ్ లో భాగంగా నిరున్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై ముంబై ఘన విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 201 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మన్ చేతులెత్తేయడంతో 57 పరుగుల తేడాతో నెగ్గింది.
ఢిల్లీ బ్యాట్స్మెన్లలో మార్కస్ స్టోయినిస్ (65), అక్షర్ పటేల్ (42) మాత్రమే చెలరేగి ఆడారు. మిగిలన వారు నిరాశపరిచారు.ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బూమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్ 2, కృనాల్ పాండ్య, కీరన్ పోలార్డ్ చెరో ఒక వికెట్ తీశారు.
ముంబై నిర్ధేశించిన 201 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ బ్యాట్స్మెన్లు చేతులెత్తేశారు. ముంబై స్టార్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో చెలరేగడంతో ఢిల్లీ టాప్-3 బ్యాట్స్మెన్లు పథ్వీషా (0), శిఖర్ ధావన్ (0), అజింక్య రహానే (0) డకౌటయ్యారు.
దుమ్ము రేపిన కిషన్ & పాండ్య…!
అంతకుముందు ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 రన్స్ చేసింది. సూర్య కుమార్ యాదవ్ (51 : 38 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు), ఇషాన్ కిషన్ (55 నాటౌట్ : 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలకు తోడు క్వింటన్ డికాక్ (40: 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్), హార్డిక్ పాండ్యా (37 నాటౌట్ : 14 బంతుల్లో 5సిక్సర్లు) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ వేసిన మూడో ఓవర్లో ఓపెనర్ రోహిత్ శర్మ ఎల్బిడబ్ల్యూగా గోల్డెన్ డక్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ డికాక్, సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపిస్తూ బౌండరీలతో చెలరేగారు.