దేశంలో కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది.ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 47,638 మందికి కరోనా నిర్ధారణ అయింది.
కాగా దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 84,11,724 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 55,331 మంది కోలుకున్నారు. అలాగే గడచిన 24 గంటల సమయంలో 670 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
అయితే దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 1,24,985 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 77,65,966 మంది కోలుకున్నారు. 5,20,773 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది.