రఫేల్ యుద్ధ విమానాల రెండో బ్యాచ్ భారత్ చేరుకున్నాయి. బుధవారం రాత్రి 8-14కు సెకండ్ బ్యాచ్ రఫేల్ జెట్లు భారత్ చేరుకున్నట్టు ఐఎఎఫ్ ట్విట్ చేసింది. సెకండ్ బ్యాచ్లో మూడు జెట్లు భారత్కు చేరుకున్నాయి. ఫ్రాన్స్ నుంచి మధ్యలో ఎక్కడా ఆగకుండా 8 గంటలపాటు 7000 కిలోమీటర్లు ప్రయాణించి రఫేల్ జెట్లు గుజరాత్లోని జామ్నగర్ వైమానిక స్థావరానికి చేరుకున్నాయి.
మూడు చోట్ల గాలిలోనే ఇంధనం నింపుకున్నట్టు ఐఎఎఫ్ తెలిపింది. మొదటి బ్యాచ్లో 5 జెట్లు ఈ ఏడాది జులై 29న హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్ నుండి మొత్తం 36 రఫేల్ జెట్లను రూ.59,000 కోట్లతో కొనుగోలు చేయడానికి భారత్ 2016లో ఒప్పందం కుదుర్చుకున్నది. 2023 వరకల్లా రఫేల్ జెట్లు భారత్ చేరుకునే ప్రక్రియ పూర్తవుతుంది.