తెలంగాణ కాంగ్రెస్ నేత,ప్రముఖ నటి విజయశాంతి బీజేపీలో చేరనుందని జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఇటీవలే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం విజయశాంతిపై ప్రశంసలు కురిపించడం చూస్తుంటే త్వరలోనే ఆమె కాషాయ కండువా కప్పుకోనుందని వార్తలకు బలం చేకూరుతోంది.
కాగా విజయశాంతి ఎంతో ప్రజాదరణ ఉన్న నాయకురాలని,తెలంగాణ ఉద్యమంలో ఆమె కీలక పాత్ర పోషించారుని బండి సంజయ్ కొనియాడారు.నాడు తెలంగాణ గ్రామాల్లో పర్యటించి ప్రజల్లో విజయశాంతి చైతన్యం కలిగించారని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రము వచ్చాక విజయశాంతిని పార్టీలు నిర్లక్ష్యం చేశాయని వ్యాఖ్యానించారు.