క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచుతూ ఎన్నడూలేని విధంగా అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియాలలో ఈసారి జరుగుతున్న ఐపీఎల్ లీగ్ దశ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి.లీగ్ లెవెల్ లో చివరి మ్యాచ్ నేడు జరగనుంది.షార్జా వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ x ముంబై ఇండియన్స్ మధ్య ఈ మ్యాచ్ జరగబోతుంది.ఇప్పటికే మిగిలిన అన్ని జట్లు లీగ్ దశలో అన్ని మ్యాచ్ లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ కు అర్హత సాధించలేకపోయాయి.
ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి.ఇక ఇంకొక జట్టు ప్లే ఆఫ్ కు అర్హత సాధించాల్సి ఉంది.ఈమ్యాచ్ లో హైదరాబాద్ గెలిస్తే ప్లేఆఫ్ చేరుతోంది.మరోవైపు కోల్ కతా కూడా 14 పాయింట్లు సాధించి రేసులో ఉన్నప్పటికీ హైదరాబాద్ కు మెరుగైన రన్ రేట్ ఉండడంతో హైదరాబాద్ కు అవకాశం ఉంటుంది.మ్యాచ్ నెగ్గలేని పక్షంలో కోల్ కతా ప్లేఆఫ్ చేరే అవకాశం ఉంది.కాబట్టి ఇది హైదరాబాద్ కు తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్.కొన్ని మ్యాచ్ లలో గెలిచే అవకాశం ఉండికూడా చేజేతులా ఓడిన హైదరాబాద్ ఈమ్యాచ్ లో తప్పనిసరిగా ప్లేఆఫ్ చేరాలని భావిస్తోంది.మంచి బ్యాటింగ్ తో పాటు పదునైన బౌలింగ్ లైనప్ హైదరాబాద్ కు బలం.మరోవైపు ముంబై కూడా అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా ఉంది.