Spread the love

సీఏఏపై (పౌరసత్వ సవరణ చట్టం) జరుగుతున్న ఘర్షణలపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు విజయదశమి సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. “సీఏఏ అనేది ఏ ఒక్క మతానికి వ్యతిరేకం కాదు. కానీ ఈ కొత్త చట్టాన్ని వ్యతిరేకించాలని చూస్తున్నవారు ముస్లిం జానాభాను తక్కువ చేయడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని ముస్లిం సోదరులను తప్పుదారి పట్టించారని అన్నారు.

కాగా అల్లరి మూకలు, అవకాశవాదులు..ఈ ఘర్షణలను కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో అందరి దృష్టి అటు మళ్లడంతో.. వారి ప్రయత్నాలకు తగిన ప్రచారం కలగలేదు.భారత సరిహద్దు దేశాల్లో వివక్షను ఎదుర్కొంటున్న మతాల వారికి పౌరసత్వ ప్రక్రియను వేగవంతం చేయడానికి పౌరసత్వ చట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు.

అయితే  రాజ్యంగ ప్రక్రియ ప్రకారం ఈ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించారని తెలిపారు. ఆ దేశాలు అక్కడి మైనార్టీ వర్గాలను హింసకు గురిచేస్తున్న చరిత్రను కలిగి ఉన్నాయి. పౌరసత్వ చట్టానికి ఈ సవరణ.. ఏ ఒక్క ప్రత్యే మతానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు. దేశానికి వచ్చే విదేశీయులకు పౌరసత్వం ఇవ్వడానికి రాజ్యంగ నిబంధనలు అలానే కొనసాగుతాయని వ్యాఖ్యానించారు.

అనంతరం హిందుత్వం గురించి కూడా ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు.కాగా అధిపత్యం పేరిట తప్పుడు ప్రచారాలను చేసే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. సుముహంలో విబేధాలు సృష్టించడానికి ఈ పదాన్ని తరుచూ వాడుతున్నారని.. ఘర్షణలు సృష్టించే వారికి ఇది లక్ష్యంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

By TheHind360

#TheHind360 is a Telugu daily digital newspaper of Andhra Pradesh & telangana.we present include business ,politics , national ,film ,sports &world news etc...!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »