తెలుగులో చిత్రపరిశ్రమలో పలు విజయవంతమైన చిత్రాలతో అలరించిన ‘రెబెల్ స్టార్’ ప్రభాస్ బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగానూ ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు.అయితే వరుస భారీ చిత్రాలతో అలరించనున్నాడు.కాగా ఆయన చిత్రం వస్తుందంటే అభిమానులతో పాటు ప్రేక్షకులలోనూ ఆసక్తి నెలకొంటుంది.కాగా,ప్రభాస్ కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది.ఈరోజు ఉదయం ‘రాధే శ్యామ్’ చిత్రం నుండి ఆయన పాత్రకు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు.
ప్రభాస్ ఈనెల 23న పుట్టినరోజు జరుపుకుంటున్నారు.ఈనేపథ్యంలో ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ విడుదల చేశారు.ఈచిత్రంలో ఆయన విక్రమాదిత్య అనే పాత్రలో అలరించనున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈచిత్రంలో పూజా హెగ్డే ప్రభాస్ సరసన నటిస్తోంది.రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.మరోవైపుప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్లో ఒక భారీ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.ఈ చిత్రానికి ‘మహానటి’ ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.
కాగా ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ అందాల తార దీపికా పదుకునే నటిస్తోంది.ప్రభాస్ 21వ చిత్రంగా తెరకెక్కుతోంది.కాగా,మరో భారీ బడ్జెట్ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారు.బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో భారీ చిత్రం చేస్తున్నారు.ఈ చిత్రానికి ‘ఆది పురుష్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈచిత్రాన్ని తమిళ,మలయాళ,కన్నడ మరియు ఇతర భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.గుల్షన్ కుమార్,టీ-సిరీస్ ఫిలిమ్స్ సమర్పిస్తున్న ఈచిత్రాన్ని భూషణ్ కుమార్,కిషన్ కుమార్,ఓం రౌత్,ప్రసాద్ సుతార్,రాజేష్ నాయర్ లు నిర్మిస్తున్నారు.
The BIG moment has arrived!! 🔥🔥
Here's introducing #Prabhas as #Vikramaditya from #RadheShyam! 😍#RadheShyamSurprise #HappyBirthdayPrabhasStarring #Prabhas & @hegdepooja pic.twitter.com/LAgm8xBJQw
— UV Creations (@UV_Creations) October 21, 2020